పంజాగుట్ట హోటల్లో సిలెండర్ బ్లాస్ట్

 

హైదరాబాద్‌ నగరంలోని పంజాగుట్ట ప్రాంతం అగ్ని ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారినట్టుంది. మొన్నామధ్య ఒక పెద్ద భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి ఒక ఫ్లోర్ మొత్తం కాలిపోయింది. ఇప్పుడు మరోసారి పంజాగుట్ట ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. పంజాగుట్టలో వున్న మోనో హోటల్లో బుధవారం ఉదయం గ్యాస్ లీక్ కావడంతోపాటు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. మోనో హోటల్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల నివసించే ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బాంబు పేలుడు సంభవించిందని భావించారు. పోలీసులు, పైర్ సిబ్బంది పేలుడు జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. పేలుడు ధాటికి హోటల్ మొత్తం చిందరవందరగా మారిపోయింది.