రాజీనామాలు అనవసరం: పనబాక

 

ఈ రోజు కొందరు కాంగ్రెస్ యంపీలు రాజీనామాలు చేయడంపై కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి స్పందిస్తూ, “ఇప్పుడు రాజీనామాలు చేయడం వల్ల పార్టీని ఇబ్బంది పెట్టడం తప్ప మరే ఇతర ప్రయోజనమూ ఉండదు. ప్రజా ప్రతినిధులమయిన మేము ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామాలు చేసి సమస్యలో భాగం కావడం కంటే, ప్రజలకు, మా పార్టీకి మధ్య వారధిగా నిలవడం అందరికీ మేలు చేస్తుందని నా అభిప్రాయం. రాజీనామాలు చేయడమనేది వ్యక్తిగత అభిప్రాయాలతో ముడిపడి ఉంటుంది. ఈ సమయంలో పార్టీ వెన్నంటి ఉండి సమస్యను పరిష్కరించడంలో నా వంతు పాత్రను పోషించడమే సమంజసమని భావిస్తున్నాను,” అని ఆమె మీడియాతో అన్నారు. అందరూ రాజీనామాలు చేస్తున్న ఈ తరుణంలో ఆమె ఈవిధంగా మాట్లాడటం పదవులపట్ల ఆమెకున్న యావేనని అందరూ భావించవచ్చును. ఆమె నిజంగా ఈ సమస్య పరిష్కారం కోసం కృషిచేస్తే ఆమె నిర్ణయం నూటికి నూరుపాళ్ళు సరయినదేనని చెప్పవచ్చును.