ఘోర రైలు ప్రమాదం.. 17 మంది మృతి..


పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పాక్ రాజధాని కరాచీలోని లండి రైల్వే స్టేషన్ లో జకారియా ఎక్స్ ప్రెస్, ఫరీద్ ఎక్స్ ప్రెస్ లు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా.. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకా ఈ ఘటనలో రెండు బోగీలు నుజ్జునుజ్జయిపోయాయి. బోగీలను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి లోపలి వారిని వెలుపలికి తీశారు. అయితే, ప్రమాదం జరగడానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.