ముషారఫ్ ముదనష్టపు వ్యాఖ్యలు

 

పాకిస్థాన్‌లో నిర్బంధ జీవితం గడుపుతూ, రేపో మాపో మరణశిక్ష పడే అవకాశం వున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కి ఇంకా పొగరు తగ్గినట్టు లేదు. అందుకే కాశ్మీర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్‌లో హింసను ప్రేరేపించే శక్తి తమ దేశానికి వుందని, ఏదో ఒకరోజున కాశ్మీర్‌లో హింసని రేపుతామని పర్వేజ్ ముషారఫ్ అన్నాడు. భారత్ - పాకిస్థాన్‌ల మధ్య మరో యుద్ధం జరగడం ఖాయమని ముషారఫ్ హెచ్చరించాడు. కాశ్మీర్ కోసం పోరాడటానికి లక్షలాది మంది పాకిస్థాన్ సైనికులు సిద్ధంగా ఉన్నారని అన్నాడు. మిస్టర్ ముషారఫ్.. కాశ్మీర్‌లో హింసను రేపే సంగతి తర్వాత.. నిన్ను పాకిస్థాన్‌ పాలకులు ఎప్పుడు చంపేస్తారో అది చూసుకో ముందు...