ఆగని పాక్ కాల్పులు... జవాను మృతి

 

భారత్ సరిహద్దులో పాక్ రేంజర్ల కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఈరోజు మరోసారి కాల్పులకు తెగబడింది. నౌషేరా సెక్టార్‌లోభారత సైన్యం, పౌర నివాసాలే లక్ష్యంగా జరిపిన షెల్స్ దాడిలో ఓ జవాను మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ఈ దాడులను సమర్థంగా తిప్పికొట్టాయని ఓ సైనికాధికారి తెలిపారు. పాక్ సైన్యానికి చెందిన మూడు పోస్టులను ధ్వంసం చేశాయని చెప్పారు. మరోవైపు క్రిష్ణఘాటి సెక్టార్‌లో పాక్ దళాలు వంద రౌండ్లకు పైగా కాల్పులు జరిపాయి.