మంజాకోట్‌పై పాక్ దాడులు..


భారత్ సరిహద్దులో పాకిస్థాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి తాజాగా దాడులు జరిపింది. నిన్న రాత్రి మంజాకోట్‌పై మోర్టార్లతో దాడులు జరిపింది. ఈ దాడుల వలన ప్రజలు ఇళ్లల్లోనే భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్థాన్ మోర్టార్ దాడులు వీడియోకు చిక్కడంతో ఈ విషయం బయటపడింది.