50 మంది తాలిబన్లు చచ్చారు

 

పాకిస్థాన్‌లోని పెషావర్‌ సైనిక స్కూలు సైనిక దుస్తులు ధరించి దాడి చేసిన తాలిబన్లు మొత్తం 148 మందిని కాల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన ప్రపంచం మొత్తాన్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తమకు ఆశ్రయమిచ్చిన పాకిస్థా‌న్‌కే భారీ నష్టం చేశారు తాలిబన్లు. ఈ దుర్ఘటన మీద పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాలిబన్లను సమూలంగా ఏరివేస్తామని ఆయన ప్రకటించారు. అలా ప్రకటించారో లేదో ఇలా 50 మంది తాలిబన్లను పాకిస్థాన్ భద్రతా దళాలు చంపేశాయి. వాళ్ళదాకా వస్తే పాకిస్థాన్ సైనికులు తీవ్రవాదం మీద ఎలా పోరాటం చేస్తారో నిరూపించారు. పాకిస్థాన్‌లోని గిరిజన ప్రాంతమైన ఖబర్‌లోని తాలిబన్ల స్థావరాలపై దాడులు జరిపిన పాకిస్థాన్ సైనికులు 50 మందిని చంపేసినట్టు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా వుందని తెలుస్తోంది.