పార్లమెంటులో తెలుగు కీర్తి రెపరెపలు

 

తెలుగు సినీకళామతల్లి ముద్దు బిడ్డ, తెలుగు కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి విగ్రహం పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిష్టించే అవకాశం ఉన్నపటికీ, గత దశాబ్ద కాలంగా ఆయన కుటుంబ సభ్యులు, పార్టీల పరంగా విడిపోయి ఆ మహనీయుడి విగ్రహం పెట్టకుండా గొడవలు పడుతూ ఇంతకాలం కాలక్షేపం చేసారు. కానీ, ఆయన కుమార్తె శ్రీమతి పురందేశ్వరి చొరవ ఫలితంగా నేటికి నందమూరి విగ్రహం డిల్లీలో కొలువయ్యే అవకాశం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో దిల్ సుక్ నగర్ పరిధిలో కోదండరాం నగర్ లో తయారవుతున్న తొమ్మిది అడుగులు పొడవుగల నందమూరి వారి విగ్రహాన్ని పరిశీలించేందుకు ఈ రోజు పార్లమెంటరీ కమిటీ వచ్చింది. మరో రెండు నెలలలో విగ్రహ నిర్మాణం పూర్తీ అవగానే, పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిష్టిస్తారు.