తెలంగాణలో నూతన పార్టీ.. నవ శకానికి నాంది పలుకుతూ వస్తున్న 'జన శంఖారావం' పార్టీ

 

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం చతికిల పడుతున్న తరుణంలో నూతన పార్టీ ఆవిర్భవించింది. అదే జన శంఖారావం పార్టీ. వెనుకబడ్డ వర్గాల ఆత్మాభిమానం, అభివృద్ధి, ఆకాంక్షల కొరకు పార్టీ స్థాపిస్తున్నట్లుగా పత్రికా ప్రకటన విడుదల చేసింది కార్యవర్గం.

స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు గడిచినా వెనుక బడ్డ వర్గాల వారికి పదవులను నామమాత్రంగానే ఇచ్చారని పేర్కొన్నారు. విద్య , ఉద్యోగ , రాజకీయంగా వెనుక బడిన వర్గాలను పాలక వర్గం కోటాకే పరిమితం చేస్తుందన్నారు. దేశ ఉన్నతిని కోరుకొని ముందడుగు వేసే వెనుకబడ్డ పౌరులకు జన శంఖారావం పార్టీ వేదికగా నిలుస్తుందని యువతను ఆహ్వానించారు.

పత్రికా ప్రకటనలో పార్టీ కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు అధ్యక్షులు పర్దిపూర్ నర్సింహ.  పార్టీ ఉపాధ్యకుడిగా వినోద్ ఖన్నా యాదవ్ , ప్రధాన కార్యదర్శిగా కంటేకర్ రాంజీ , కోశాధికారిగా బి.నాగరాజు గుప్తా , ఉమ్మడి కార్యదర్శిగా ఎ. గణేష్ రెడ్డి , నిర్వహరణ కార్యదర్శులుగా జి.సాయి కిషోర్ , ఎం. రవి ముదిరాజ్ , కార్యనిర్వాహకులు - జె.అవినాష్ ( చింటు ) , ఎస్. శ్రీ శైలం యాదవ్ పేర్లను పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

గతంలో ఆయన ప్రజారాజ్యం, జనసేన పార్టీ ప్రధాన నేతల్లో ఒకరిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడిగా ఇరు రాష్ట్రాల్లో పేరు పొందారు జన శంఖారావం పార్టీ అధ్యక్షులు పర్దిపూర్ నర్సింహ. తెలంగాణలో వెనుక బడ్డ వర్గాల ఉనికిని చాటడానికే ఆయన పార్టీ స్థాపించారంటూ అనుచరులు చెబుతున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా సాగుతున్న తెలంగాణ రాజకీయంలో ఈ పార్టీ నవ శాఖానికి నాంధి పలుకుతుందో లేదో వేచి చూడాలి.