తెలంగాణాలో టీఆర్ఎస్ పైచేయి
posted on Mar 15, 2014 2:42PM
తెలంగాణా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా దెబ్బతింటుందని ఎన్డీటీవీ సర్వే చెబుతోంది. ఇక్కడ మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా.. అందులో 11 సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంటుంది. ఇది గతం కన్నా 9 సీట్లు ఎక్కువ. తెలంగాణా ప్రకటించిన కాంగ్రెస్కు కేవలం 5 సీట్లు మాత్రమే లభిస్తాయని సర్వే తెలిపింది.
సీమాంధ్రలో కాంగ్రెస్ కు ఒక్కటే
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మట్టికరవనుందని ఎన్డీటీవీ సర్వే స్పష్టంచేస్తోంది. ప్రస్తుత లోక్సభలో ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్కు 21 సీట్లు ఉంటే.. ఇప్పుడు ఒక్క సీటుకే పరిమితమవుతుందని సర్వే చెప్తోంది. మొత్తం 25 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. అలాగే.. టీడీపీ-బీజేపీ కూటమికి 9 సీట్లు వచ్చే అవకాశముందని పేర్కొంది.