పాక్ లో నవాజ్ షరీఫ్ విజయం
posted on May 12, 2013 3:29PM
పాకిస్థాన్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ విజయం సాధించింది. దిగువసభకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో అధికార పీపీపీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. మొత్తం 272 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. వీటిల్లో 126 స్థానాల్లో పైగా పాకిస్థాన్ ముస్లీం లీగ్ – నేషనల్ విజయం సాధించి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రిక్-ఐ-ఇన్సాఫ్ 34 స్థానాల్లో విజయం సాధించగా ఇతరులు 71 స్థానాల్లో గెలిచారు. పీపీపీ పార్టీ కేవలం 32 స్థానాల్నే సాధించి ప్రధాన ప్రతిపక్షం హోదా కోల్పోయింది. ఎన్నికల్లో తాము విజయం సాధించామని, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలకు రమ్మని భావ సారూప్యం గల ఇతర పార్టీలకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం కూడా పలికారని ‘సమా’ టివి చానెల్ కథనం ప్రసారం చేసింది. ప్రజల కోసం ఏ పార్టీతోనైనా, నాయకుడితోనైనా చర్చలకు తాను సిద్ధమని ఆయన ప్రకటించినట్లు తెలిపింది. పంజాబ్లోని సర్గోధా స్థానంలో షరీఫ్ విజయం సాధించారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఎ- ఇన్సాఫ్ (పిటిఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పెషావర్-1 స్థానంలో 66,464 ఓట్లతో ఘన విజయం సాధించారు.