నేషనల్ హెరాల్డ్..సోనియా, రాహుల్ కు ఊరట..

నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసు వ్యవహారంలో కింద కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సోనియా, రాహుల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై విచారించిన కోర్టు వారికి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చింది. సోనియా, రాహుల్ తో పాటు మరో ఐదుగురికి కూడా సుప్రీం మినహాయించింది. కాగా నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని.. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సోనియా, రాహుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.