4లక్షల ఓట్లతో వడోదరలో మోడీ విజయం
posted on May 16, 2014 12:01PM
బిజెపి నాయకుడు నరేంద్ర మోదీ వడోదరలో సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ మిస్త్రీ పై ఆయనకు 4 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం లభించింది. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి 326 స్థానాల్లో దూసుకుపోతుంది. సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించింది. ఎన్నికల ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించడానికి ముందే కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని అంగీకరించింది. ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో శుక్రవారం ఉదయం పదిన్నరకే ప్రకటించింది.ఈ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ప్రధాన అభ్యర్థిగా పేర్కొన్న యువనేత రాహుల్ గాంధి సైతం ఒక దశలో వెనుకపడి మళ్లీ కాస్త పుంజుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పిన మహామహులు ఎందరో ఓడిపోతున్నారు. స్పీకర్ మీరా కుమార్, కమల్ నాథ్, కపిల్ సిబాల్, సుశీల్ కుమార్ షిండే వంటివారంతా ఓటమి అంచుల్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఉద్దండులు అందరూ ముందంజలో ఉన్నారు.