మోడీ ర్యాలీకి 5 రూపాయలు టికెట్

 

Narendra Modi rally, Narendra Modi rally Hyderabad, BJP Narendra Modi

 

 

దేశ భవిష్యత్ ప్రధానిగా భావించబడుతున్న నరేంద్రమోడీ ముందు రాహుల్ గాంధీ ప్రభ వెల వెలబోతుంది. గుజరాత్ సర్వతోముఖాభివృద్ది నరేంద్రమోడీ జాతి దృష్టిని ఆకర్షించారు. మూడో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికయిన ఆయన అయితేనే ఈ దేశానికి దిశానిర్ధేశం చేయగలుగుతారని, ప్రపంచ దేశాలతో పోటీ పడలేకపోతున్న భారత్ కు ఆయనే దిక్సూచి అని యువత భావిస్తోంది.

 

బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ గా మోడీ ఇప్పటికే పోటీలో దూసుకెళ్తున్నాడు. దేశవ్యాప్తంగా ఆయన పర్యటనలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. త్వరలోనే ఆయన హైదరాబాద్ లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించబోతున్నారు.  ఈ నేపథ్యంలో మోడీ ర్యాలీకి హాజరయ్యే ప్రతి ఒక్కరూ రూ.5 చెల్లించి టికెట్ కొనుక్కోవాలని నిర్ణయించారు. ఈ విధంగా వసూలయిన మొత్తం ఉత్తరాఖండ్ వరద బాధితులకు పంపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇదో మంచి ప్రయత్నంగా మిగులుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.