రేపు విజయవాడలో మోడీ సభ

 

నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి నిన్న ఒకేరోజు సీమాంద్రాలో ఐదు సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంచేసి రెండు పార్టీ శ్రేణులకు నూతనోత్సాహం కలిగించగలిగారు. మళ్ళీ రేపు అంటే శనివారం వారు ముగ్గురు కలిసి విజయవాడలో మరో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం సభ నిర్వహించే వరకు చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తారు. అయన ఈరోజు విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలలో ఎన్నికల ప్రచారం చేస్తారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలపై పూర్తి పట్టు సాధించగలిగిన పార్టీకే సర్వసాధారణంగా విజయావకాశాలు ఉంటాయి గనుక తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలు ఆ మూడు జిల్లాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి.