న‌రేంద్రమోడి స‌భ‌కు స‌ర్వం సిద్దం

 

ఎల‌క్షన్లకు ఇంకా చాలా రోజులు ఉండ‌గానే బిజెపి త‌న ప్రచ‌రాన్ని మొద‌లు పెట్టింది. ఆ పార్టీ ప్రచార సార‌దిగా ఉంటూ ప్రదాని అభ్యర్ధిగా కూడా భావిస్తున్న గుజ‌రాత్ ముఖ్యమంత్రి న‌రేంద్ర మోడి ఆదివారం హైద‌రాబాద్ రానున్నారు.  హైదరాబాద్ వేదికగా తన ప్రచారయుద్ధాన్ని మొదలుపెట్టనున్నారు.

'నవభారత యువభేరి' పేరుతో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో మోడీ భారీ బ‌హిరంగ స‌భ నిర్వహించ‌నున్నారు. ఇందుకు బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. స‌భ‌కు వ‌చ్చే అభిమానులు కార్యక‌ర్తల నుంచి ఐదు రూపాయ‌ల చొప్పున ప్రవేష రుసుమును వ‌సూలు చేయ‌నున్నారు అయితే ఈ మొత్తాన్ని ఉత్తరాఖండ్ వ‌ర‌ద బాదితుల‌కు అందించ‌నున్నారు.

ఈ స‌భ‌కు లక్షకు పైగా ప్రజలు వ‌స్తార‌ని భావిస్తున్న బిజెపి అందుకు త‌గ్గట్టుగానే ఏర్పాట్లాను చేస్తున్నారు. రాష్ట్ర పర్యటన భాగంగా బ‌హిరంగ స‌భ‌తో పాటు నరేంద్రమోడీ ఓ పాఠశాలలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పార్టీ రాష్ట్ర నాయ‌కుల‌తో సమావేశం అవుతారు.