నారాయణఖేడ్ బైపోల్ బరిలో అధికార పార్టీ

కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్ణారెడ్డి హఠాన్మరణంతో అనివార్యమైన నారాయణఖేడ్ బైపోల్ లో వామపక్షాలు పోటీ చేయాలని ప్రకటించడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా బరిలోకి దిగాలని డిసైడైంది, కిష్ణారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని అన్ని పార్టీలనూ కాంగ్రెస్ కోరినప్పటికీ, సీపీఎం పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది, దాంతో ఎలాగూ ఎన్నిక జరుగుతుందని కాబట్టి పోటీ చేయడమే మంచిదనే నిర్ణయానికి టీఆర్ఎస్ వచ్చింది, పైగా నారాయణఖేడ్ పై కన్నేసిన కేసీఆర్... ఇప్పటికే మంత్రి హరీష్ కి బాధ్యతలు అప్పగించారు, దాంతో టీఆర్ఎస్ నేతలు ఇప్పట్నుంచే ముమ్మరంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు, గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఎం.భూపాల్ రెడ్డికే మళ్లీ టికెట్ దక్కొచ్చని సమా చారం, టీఆర్ఎస్ పోటీకి దిగాలని నిర్ణయం తీసుకోవడంతో... హరీష్ తోపాటు మంత్రి ఈటెల, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు నారాయణఖేడ్ పై ఫోకస్ పెట్టారు.