గవర్నర్ అంటే నరసింహన్‌లా వుండాలి: ఓటు హక్కు వినియోగం!

 

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అసలు గవర్నర్ అంటే ఎలా వుండాలో ఉదాహరణగా నిలిచారు. రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన ఆయన ఓటు వేయడానికి అందరికంటే ముందున్నారు. రాజ్‌భవన్ ఏరియాలోని ఎం.ఎస్. మక్తాలోని పోలింగ్ కేంద్రనికి గవర్నర్ ఉదయాన్నే తన భార్యతో కలసి వెళ్ళారు. ఓటు వేసిన అనంతరం ఆయన తన భార్యతో కలసి ఓటు వేసినట్టుగా చూపుడువేళ్ళని మీడియాకి చూపించారు. గవర్నర్ ఓటు వేస్తుండగా మీడియా కెమెరాలు చిత్రీకరించడానికి ప్రయత్నించాయి. అయితే ఆయన దాన్ని వారించారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యం మనకు ఇచ్చిన గొప్ప అవకాశం అని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నరసింహన్ చెప్పారు.