నరేంద్రమోడీకి గొంతు సమస్య

 

భారత ప్రధాని నరేంద్రమోడీ గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని వేల ప్రసంగాలు చేసిన నరేంద్రమోడీ తాజాగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంగా రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ భారీ స్థాయిలో ప్రసంగాలు చేస్తున్నారు. అలా మాట్లాడీ మాట్లాడీ నరేంద్రమోడీకి గొంతు నొప్పి వచ్చింది. గొంతు కూడా బాగా బొంగురుపోయింది. శుక్రవారం నాడు ఆయన తన గొంతు సహకరించకపోవడంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో తన ప్రసంగాన్ని కేవలం 9 నిమిషాలకే పరిమితం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన..  ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు. గతరాత్రి వరకు మోడీ గొంతు బాగానే ఉందని, తెల్లవారుజామున ఉన్నట్లుండి బాగా ఇబ్బందిపడుతున్నట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. భారీస్థాయిలో వచ్చిన ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు తాను మాట్లాడలేకపోయినందుకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పారు.