జగన్, మీ బిల్డప్స్ ఆపండిక : నారా లోకేష్ ట్విట్టర్ హెచ్చరిక 

వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు, మీ ఇంటికొస్తే ఎం ఇస్తారు,మా ఇంటికొస్తే ఎం తెస్తారు అనే రకమంటూ టీ డీ పీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. " ఆయనకు కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రజలు,రైతులు, డాక్టర్లు,ఉద్యోగస్తులు పై లేకపోవడం బాధాకరం. గత ఏడాది కంటే 30 వేల కోట్లు అధిక ఆదాయం  ఉన్నా డాక్టర్ల కు ఇచ్చే మాస్కులు, ఉద్యోగస్తుల జీతాల నుండి ప్రజలకు అందించే సహాయం వరకూ కోతలు పెడుతున్నారు. మరి కాంట్రాక్టర్ల పై కురిపించిన 6,400 కోట్లు ఆకాశం నుండి ఊడిపడ్డాయా," అంటూ లోకేష్ ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో కేంద్రం చేస్తున్న సహాయం తాను చేస్తున్నట్టు బిల్డ్ అప్ ఇవ్వడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఏమి లేదని అభిప్రాయపడ్డారు లోకేష్. 

కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 5 కేజీలు ఉచిత బియ్యం, ఒక కేజీ  కందిపప్పు ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 16 రకాల నిత్యావసరాలు ఉచితంగా ఇచ్చారు. సర్వం కోల్పోయిన ప్రజలకు కొన్ని రాష్ట్రాల్లో ఐదు వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. జగన్ గారు మాత్రం బీద అరుపులతో సరిపెడుతున్నారంటూ లోకేష్ విరుచుకుపడ్డారు.