వంశీ, నాని ఇంతటితో ఆపితే మంచిది.. నందమూరి వారసుడు వార్నింగ్

 

టిడిపి అధినేత చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వైసిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వరుస పెట్టి నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టిడిపి నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీతో పాటు మంత్రి కొడాలి నాని..అంబటి రాంబాబు.. ఓ రేంజ్ లో స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. వైసిపి నేతలతో పాటు వంశీ విమర్శలకు టిడిపి నేతల నుంచి కౌంటర్ లు పడ్డాయి. టిడిపి నేతల కౌంటర్లు అన్ని నామమాత్రంగానే ఉండిపోయాయి. ఈ రభాసకి తెరతీయడానికి నందమూరి వారసుడే ముందుకు రావాల్సి వచ్చింది.

మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి  గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ. ఇక్కడెవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు అంటూ చైతన్య కృష్ణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విధానాల పై విమర్శలు చేస్తే పర్వాలేదు కానీ వ్యక్తిగత దూషణలకు దిగితే ఊరుకునేది లేదు.. జాగ్రత్త అని సవాల్ చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. నందమూరి వంశం నుంచి రెస్పాన్స్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చైతన్య కృష్ణ వీడియో వైరల్ అవుతుంది.  నందమూరి వంశం నుంచి మళ్లీ ఓ వారసుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అనే డిస్కషన్ సాగుతోంది. పార్టీ లోకి జూనియర్ ఎన్టీఆర్ తిరిగి రావాలనే అంశాన్ని కొందరు నేతలు తెరపైకి తెచ్చారు. దీంతో నందమూరి వారసుడు తోనే జూనియర్ టాపిక్ కు చెక్ పెట్టాలనే చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారనే  ప్రచారం జరుగుతుంది.