హుదుద్ వల్ల విశాఖకు అపార నష్టం: బాలయ్య

 

హుదుద్ తుఫాను కారణంగా విశాఖకు అపార నష్టం వాటిల్లిందని సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తుఫాను బాధితులను పరామర్శించడానికి విశాఖ వచ్చిన బాలకృష్ణ బాధితులను ఆదుకోవడం కోసం తనవంతు సాయంగా 35 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ‘‘అందమైన పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందిన విశాఖలో పచ్చదనం పూర్తిగా కనుమరుగైంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలకు అంచనాలకు అందని భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదు రోజులుగా ఈ ప్రాంతంలోనే వుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, తుఫాను బాధితులలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు’’ అన్నారు.