చేయిచేసుకున్న ఎంఆర్ఓ ..విలపించిన యువతి

 

ప్రభుత్వ అధికారిణిగా బాధ్యతాయుతమైన పదివిలో ఉండి ఓ యువతి పట్ల భాద్యతారాహిత్యంగా చేయిచేసుకోవటంతో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన చోటుచేసుకుంది.నాంపల్లి మండలం చిట్టంపహాడ్‌కు చెందిన ఉగ్గపల్లి సరిత ఆదాయ, కులధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చారు. ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ రశీదులతో కార్యాలయంలోని కంప్యూటర్‌ కౌంటర్‌ వద్ద నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలో ఛాంబర్‌ నుంచి బయటకు వచ్చిన ఎంఆర్ఓ కేసీ ప్రమీల.. ఇక్కడ నీకేంపని అంటూ ఆగ్రహంతో చేయిచేసుకున్నారని సరిత రోదిస్తూ తెలిపింది. విషయం తెలుసుకున్న యువతి బంధువులు కార్యాలయానికి చేరుకొని ఎంఆర్ఓ తో వాగ్వాదానికి దిగారు.అయితే ఎంఆర్ఓ మాత్రం తాను ఎవరిపై చేయిచేసుకోలేదని, కంప్యూటర్‌ కౌంటర్‌ వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో పక్కకు జరగాల్సిందిగా చేతితో తట్టి సూచించానని తెలిపారు.