పోలీసులు కాదు జల్సారాయుళ్లు...

పోలీసులంటేనే విమర్శలకు కేంద్రాలుగా మారిపోయారు. చేతిలో అధికారం ఉంది ఎవరూ ఏం చేయలేరనేమో వాళ్ల ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే నల్లొండ జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు మందు పార్టీ చేసుకొని, తప్పతాగి తెగ చిందులేశారు. గుండుంబా తయారీని ఆపాల్సిన పోలీసులే నల్లబెల్లం వ్యాపారితో కలిసి పోలీస్ స్టేషన్ లోనే జల్సా చేశారు. సీనియర్ పోలీసులు జూనియర్ పోలీసులకు కూడా మందు పోస్తే బాగుండేది. అలా చేయకుండా మొత్తం వాళ్లే తాగేశారు. దాంతో జూనియర్ పోలీసుల ఒళ్లుమండిపోయి వాళ్లు చేసిన పనిని వీడియా తీసి బయటికి లీక్ చేశారు. పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.