హైదరాబాద్‌ కేసీఆర్‌ అబ్బ సొత్తా?

 

తెరాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు పలువురు టీడీపీ నాయకులు.అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి నక్కా ఆనందబాబు ‘కేసీఆర్ నీకు సిగ్గుందా?.. నీలాంటి నీచుడు రాజ‌కీయాల్లో ఉండ‌రు’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.పోటుకాడు త‌న్నుకోవ‌డానికి వ‌స్తాడా? రమ్మనండి అంటూ సవాల్ విసిరారు.చంద్రబాబుపై కేసీఆర్‌ వాడిన భాషను దేశంలో మరే సీఎం ఉపయోగించరని, తెదేపాని చూస్తే కేసీఆర్‌కి వణుకు పుడుతోందని ఆయన ధ్వజమెత్తారు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది తెదేపాయే అని.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతున్నారని ఆనందబాబు మండిపడ్డారు.2009లో చంద్రబాబుతో ఎందుకు పొత్తుపెట్టుకున్నావని మంత్రి ప్రశ్నించారు.కేసీఆర్‌ మనిషి అయితే ఆయనకు మూడో కన్ను ఎలా ఉంటుందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో ఆయన చేసిన ఒక మంచిపని చెప్పగలరా అంటూ ఆనందబాబు నిలదీశారు.ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకునేందుకే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ రోడ్లను చూసి సిగ్గు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్‌ కేసీఆర్‌ అబ్బ సొత్తా? అని...తమకు పదేళ్ల హక్కు ఉందని ఆనందబాబు స్పష్టం చేశారు. కేసీఆర్‌ చేసిన దొంగదీక్షలతో తెలంగాణ రాలేదని, కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకరాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు.