మోడీకి నాగ్ మద్దతు..అమలకు వద్దు

 

 

 

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున నరేంద్రమోదీతో అహ్మదాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆయనతో 40 నిముషాలపాటు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ఆయన అన్నారు. తన భార్య అమల ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నానని వస్తున్న వార్తలను నాగార్జున ఖండించారు. తమ కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

 

అభివృద్ధిలో గుజరాత్ దూసుకు వెళ్తుందని, పలు అభివృద్ధి ప్రాజెక్టులు స్వయంగా చూశానని నాగార్జున పేర్కొన్నారు. గుజరాత్‌లో 24 గంటలూ విద్యుత్ ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. ఎన్నో గ్రామాలకు ఇంటర్నెట్, వైపై అనుసంధానం ఉందని, మోదీ పాలన చాలా బాగుందని ఆయన కొనియాడారు. మోదీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్లు నాగార్జున పేర్కొన్నారు.