సన్నాసుల్లారా...! మంత్రులపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు

ఇష్యూ ఏదైనా తనదైన శైలిలో స్పందించే మెగా బ్రదర్ నాగబాబు...  వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేయడంతో... నాగబాబు కూడా అంతే ఘాటుగా రియాక్టయ్యారు. గుండుసున్నా దేనితో కలిసినా... ఫలితం జీరోనే అంటూ విజయసాయి చేసిన ట్వీట్ కు జనసేన నేత నాగబాబు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. జీరో విలువ తెలియని వెధవలకు ఏం చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సైన్స్, కంప్యూటర్, మ్యాథ్స్ ఇంత డెవలప్ అయ్యాయంటే... సున్నా మహత్యమేరా... చదువుకున్న సన్నాసుల్లారా అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు. విజయసాయిపైనే కాదు అంబటి, అవంతి, పేర్ని నానిపైనా నాగబాబు విరుచుకుపడ్డారు. ఇలాంటి వైసీపీ లీడర్ల వల్లే ఎక్స్ ట్రా జబర్దస్త్ లేని లోటు తీరిందంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే, వెధవలు... ఏరా... సన్నాసుల్లారా... లాంటి తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ నాగబాబు ట్వీట్స్ చేయడంతో.... వైసీపీ నుంచి కూడా మళ్లీ స్ట్రాంగ్ రియాక్షన్ కచ్చితంగా వస్తుంది. ఈ లెక్కన జనసేన-వైసీపీ మధ్య ట్వీట్ల యుద్ధం... ఏపీ రాజకీయాల్లో సరికొత్త హీట్ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.