ఏపీ లో కాంగ్రెస్ కి షాక్

 

కాంగ్రెస్ సీనియర్ నేత,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేశారు.తిరుపతిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో మనోహర్ జనసేన పార్టీలో చేరనున్నారు.కొన్నాళ్లుగా టీడీపీ,వైసీపీ లో చేరతాడు అన్న వదంతులను ఖండిస్తూ వచ్చిన మనోహర్ చివరికి జనసేనలో చేరుతున్నారు.ఏఐసిసి పదవుల విషయంలో మనోహర్ పట్ల నిర్లక్ష్యం చూపటమే పార్టీ మారటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.రాహుల్ గాంధీ తో సన్నిహిత సంబంధాలు ఉన్న మనోహర్ ఏఐసిసి సభ్యునిగా అవకాశం ఇస్తారని,జాతీయ రాజకీయాల్లో ద్రుష్టి పెడదామనుకున్న నేపథ్యంలో పదవి ఇవ్వకపోవటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.అయితే మనోహర్ మాత్రం పార్టీ మారటానికి గల కారణాన్ని మాత్రం వ్యక్త పరచలేదు.కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న మనోహర్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి కచ్చితంగా షాకేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటివరకు జనసేనలో ఇతర పార్టీల నుంచి కీలక నేతలెవరూ చేరలేదు. మనోహర్‌ రాకతో ఆ పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు.