రాజమండ్రి మళ్ళీ మురళీమోహన్ కే
posted on Mar 22, 2013 10:31AM
తూర్పు గోదావరి జిల్లలో వస్తున్నా మీ కోసం యాత్ర చేస్తున్న చంద్రబాబు రాజమండ్రి, అమలాపురం పార్లమెంట్ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. మూడు పార్లమెంటు స్థానాలకు గాను రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రాజమండ్రి పార్లమెంటు స్థానానికి గత ఎన్నికల్లో ఓడిపోయిన సినీ నటుడు మురళీమోహన్ ను, అమలాపురం స్థానానికి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును ప్రకటించారు.
తాను తిరిగి రాజమండ్రి నుండి పోటీ చేస్తానంటున్న మురళీమోహన్ అభ్యర్థిత్వాన్ని కూడా ముందే ఖరారు చేసుకుని ఏడాది ముందే ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఇక గతంలో టీడీపీలో ఉండి కాంగ్రెస్ లోకి వెళ్లి, మళ్లీ టీడీపీలోకి వచ్చిన గొల్లపల్లిని ఎంపీ స్థానానికి ప్రకటించడం వ్యూహాత్మకంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక పాదయాత్ర జిల్లాలో ముగిసేలోపు కాకినాడ ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది.