పురపాలక ఎన్నికలలో మొదటి విజయం టీడీపీదే!

 

పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు విడుదలవటం ప్రారంభమైంది. తెలంగాణలో మొదటి ఫలితం విడుదలైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలుగుదేశం అభ్యర్థి మొదటి విజేతగా నిలిచాడు. టీఆర్ఎస్ బలంగా వుందని ఇప్పటి వరకూ ఆ పార్టీ నాయకులు అనుకుంటున్న ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోణీ చేయడం ఆశ్చర్యకరం. అలాగే వికారాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అదేవిధంగా వరంగల్ జిల్లాలో మొదటి విడత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి జనగాంలో ఒక వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైన ఇరవై నిమిషాలలోనే నాలుగు ఫలితాలు వెల్లడయ్యాయి. సమయం గడిచేకొద్దీ కౌంటింగ్ వేగం పెరిగే అవకాశాలున్నాయి.