అమెరికా టు అమలాపురం.. ఆపై నామినేషన్

 

 

 

రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఏకంగా అమెరికా నుంచి విమానంలో వచ్చి మరీ హాజరు వేయించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఈ సంఘటన జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పట్టణ మహిళా కన్వీనర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దిట్టకవి వెంకటనర్సమాంబ (అమ్మాజీ) కొన్ని నెలల క్రితమే అమెరికాలో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లారు. ఇంతలోనే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. అమ్మాజీని 23వ వార్డు నుంచి పోటీ చేయించాలని పట్టణ పార్టీ శాఖ నిర్ణయించింది. ఈ సమాచారాన్ని ఆమెకు అందజేశారు. వాస్తవానికి అమ్మాజీ ఈనెల 18న స్వదేశానికి రావడానికి విమానం టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈలోపే పార్టీ నుంచి ఆదేశాలు రావడంతో ఆగమేఘాల మీద ముందే విమానం ఎక్కాల్సి వచ్చింది. అలా వచ్చేసి, ఆమె నామినేషన్ దాఖలు చేశారు.