చకచకా సాగుతున్న ఓట్ల కౌంటింగ్

 

పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమై చకచకా జరుగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన ఇరవై నిమిషాలలోనే నాలుగు పురపాలక ఫలితాలు వెల్లడి కావడం విశేషం. రాష్ట్ర వ్యాప్తగా 10 నగరపాలక సంస్థలు, 145 మునిసిపాలిటీలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పురపాలక సంఘాల్లో రెండు రౌండ్లలో, నగరపాలక సంస్థల్లో నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల కౌంటింగ్ మహా ఫాస్ట్ గా జరుగుతున్నందున సోమవారం మధ్యాహ్నానికల్లా మొత్తం ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం వుంది.