అద్దె ఇంటి కోసం వెతుకులాట.. యువతిపై సామూహిక అత్యాచారం..

 


ముంబైలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ యువతిపై సామూహిక హత్యాచారం జరిపారు. వివరాల ప్రకారం.. ముంబైలోని అంబోలి ప్రాంతంలో  ఓ యువతి తన భర్తతో కలసి అద్దె ఇంటిని వెతుక్కుంటూ వెళ్లింది. ఆ క్రమంలో అంబోలీ ప్రాంతంలో అద్దె ఇంటిని వెతుకుతున్న సమయంలో, ఖాళీగా ఉన్న ఓ ఇంటిని చూసేందుకు ఆమె లోపలకు వెళ్లింది. ఆ సమయంలో ఇల్లు చూపించేందుకు లోపలికి వచ్చిన వారిలో ముగ్గురు ఆమె భర్తను బయటే నిర్బంధించగా, నలుగురు ఆమెపై అదే ఇంట్లో అత్యాచారం చేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.