ముఖేష్ అంబానీకి భారీ షాక్.. 10 వేల కోట్లు జరిమానా..
posted on Nov 4, 2016 3:32PM
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారీ నజరానా విధించింది. ఎన్జీసీ-రిలయెన్స్ సంస్థలకు చెందిన కేజీ- డీ 6 బ్లాక్ పై కొంతకాలంగా గ్యాస్ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. 10,312 కోట్ల రూపాయలు కట్టాలని ఆదేశించింది. ఓకృష్ణా గోదావరి (కేజీ) బేసిన్లో రిలయన్స్కు చెందిన బావుల పక్కనే ఉన్న ఓఎన్జీసీ బావుల నుంచి గ్యాస్ను తోడివేసిందన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఓఎన్జీసీ గ్యాస్ను ఆర్ఐఎల్ ఉత్పత్తి చేసినందున అందుకు పరిహారంగా చెల్లించాల్సిన మొత్తాన్ని చమురు మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)1 బిలియన్ డార్లుగా ( సుమారు రూ. 6652.75 కోట్లుగా) లెక్క కట్టడంతో.. 1.55 బిలియన్ డాలర్లు( దాదాపు 10,312 కోట్ల రూపాయలు) జరిమానా కట్టాలని కేంద్ర సర్కారు పేర్కొంది.