ముద్రగడ పాదయాత్రకు కోర్టు గ్రీన్ సిగ్నల్..

 


కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన కాపు ఐక్య గర్జన పేరిట పెద్ద దుమారం రేపారు. అయితే ఇప్పుడు ఆయన సత్యాగ్రహ పాదయాత్రను ప్రారంభించాలనుకుంటున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 16 నుంచి 21 వరకూ కోనసీమలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన చేపట్టాలనుకున్న పాదయాత్రపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పుడు దీనిపై విచారించిన హైకోర్టు పాదయాత్రకు అంగీకారం తెలిపింది. ఆయన యాత్ర చేసినంత మాత్రాన శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడం సరికాదని.. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, ఒకవేళ ఏదైనా శాంతిభద్రతల సమస్యలు వస్తే పోలీసులు చూసుకోవాలని స్పష్టం చేసింది. దాంతో ఆయన యాత్రపై ఉత్కంఠ నెలకొంది.