రేవంత్ పిర్యాదు..వినోద్ వివరణ
posted on Nov 1, 2018 12:10PM
తెరాసకు అనుకూలంగా ప్రచారం చేస్తూ ఇతర పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా సంస్థలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే.దీనిపై తెరాస ఎంపీ వినోద్ ఆ వార్తా సంస్థలు తమవి కాదంటూ సీఈవో రజత్కుమార్కు వివరణ ఇచ్చారు.తెరాసకి ఎలాంటి టీవీ చానల్ గానీ, న్యూస్పేపర్ గానీ లేవని స్పష్టం చేశారు.తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డితో కలిసి సచివాలయంలో రజత్కుమార్ను కలిశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ ..సీఎం కేసీఆర్ది తెలంగాణ కులం అని.. ఆయన అన్ని కులాలను ఒకే విధంగా చూస్తారని చెప్పారు. అలాంటి వ్యక్తికి కులాన్ని ఆపాదించడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ స్టార్ కాంపైనర్గా విస్తృత పర్యటనలు చేయాల్సి ఉండటంతో హెలికాప్టర్ అనుమతుల వివరాలను సీఈవో అడిగారని, ఆ వివరాలు అందించేందుకే వచ్చానని తెలిపారు. కేసీఆర్ గతంలోనూ కంటి పరీక్షలకు ఢిల్లీకి వెళ్లినట్లే ఇప్పుడు కూడా వెళ్లారని కానీ ప్రతిపక్షాలు దాన్ని రాజకీయ పర్యటనగా చిత్రీకరిస్తున్నాయన్నారు.