రాయపాటి రాజీనామా హెచ్చరిక

 

 rayapati samba siva rao

 

 

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడానికి మొగ్గుచుపుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో సమైఖ్య సెగ పెరుగుతోంది. తెలంగాణ ఇస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని లగడపాటి రాజగోపాల్ ప్రకటిస్తే... రాష్ట్ర విభజన జరిగితే పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. తాను ముమ్మాటికి సమైక్యవాదినేనని అన్నారు. తెలంగాణ, సమైక్యం పైన రెఫరెండం పెడితే తాను సమైక్యవాదానికే ఓటు వేస్తానని ఆయన చెప్పారు.

 


మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై వారం, పది రోజుల్లో తేల్చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతూ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.  తెలంగాణపై తేల్చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. విభజన, సమైక్యవాద సభలకు అనుమతించిన దిగ్విజయ్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.