పెట్రోల్ ట్యాంకర్ పేలి 73 మంది మృతి...

 

పెట్రోల్ ట్యాంకర్ పేలి 73 మందికి పైగా మృతి చెందగా.. వందమందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటన మొజాంబిక్ లోని టెటె ఏరియాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..  మొజాంబిక్ లోని బీరా నగరం నుంచి మాలావికి ఓ ట్యాంకర్ పెట్రోల్ లోడ్‌తో వెళ్తుండగా మార్గం మధ్యలో వాహనాన్ని నిలపగా.. పెట్రోల్ కొనుగోలు చేసేందుకు టెటె గ్రామస్తులు ట్యాంకర్ చుట్టూ గుమిగూడారు. ఆ సమయంలో అది పేలడంతో 73 మంది అక్కడికక్కడే మరణించారు. మ‌రో 110 మంది గాయ‌ప‌డ్డారు. అందులో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. స్థానికుల దాడి వ‌ల్లే ఆ ట్ర‌క్కు పేలి ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు.
పేలుడు ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించనుందని తెలిపారు.