టీడీపీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం..

 

టీడీపీ ఎమ్మెల్యే కు ప్రమాదం తృటిలో తప్పింది. పోలవరం ఎమ్మెల్యే  మొడియం శ్రీనివాస్‌ బొర్రంపాలెం గ్రామంలో జన చైతన్య యాత్రలో పాల్గొని తిరిగి వెళుతుండగా... ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు ఊడిపోయింది. దాదాపు 60 గజాల దూరం కారు రోడ్డుపై గీసుకుంటూ వెళ్లి ఆగింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.