వారణాశిలో 24న నరేంద్రమోడీ నామినేషన్

 

 

 

భారతీయ జనతాపార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈనెల 24న వారణాశి పార్లమెంట్ నియోజకవర్గం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నరేంద్రమోడీ గుజరాత్‌లోని వదోదర, ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నియోజకవర్గాల నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వదోదరలో ఇప్పటికే మోడీ నామినేషన్ దాఖలు చేశారు. వారణాశిలో మోడీ 24న నామినేషన్ దాఖలు చేయనున్న విషయాన్ని మోడీ సన్నిహితుడు అమిత్ షా ప్రకటించారు. వారణాశిలో మే 12న పోలింగ్ జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యే అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు.