జపాన్ పర్యటనకు మోడీ

 

భారత ప్రధాని నరేంద్రమోడీ జపాన్ పర్యటనకు బయల్దేరి వెళ్ళారు. మోడీ జపాన్‌లో నాలుగు రోజుల పాటు పర్యటిస్తారు. శనివారం నాడు మోడీ అధికారులు, పలువురు పారిశ్రామికవేత్తలో కూడిన బృందంతో జపాన్‌కి బయల్దేరి వెళ్ళారు. ఈ పర్యటనలో మోడీ వెంట ముఖేష్ అంబానీ, అజీమ్ ప్రేమ్ జీ కూడా వున్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో జపాన్‌తో దౌత్య సంబంధాలను ఎంతమాత్రం పట్టించుకోకపోవడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ సంబంధాలను పునరుద్ధరించే ఉద్దేశంలో మోడీ వున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మోదీ పర్యటన సాగనుంది. ఈ పర్యటలో భాగంగా రక్షణ, పౌర అణు రంగాల్లో ఒప్పందాలకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోడీ తన జపాన్ పర్యటనకు ముందు ట్విట్టర్‌లో ట్విట్ చేస్తూ జపానీస్ భాషను ఉపయోగించడం ఆ దేశంలో మోడీ మీద అభిమానం పెరగడానికి కారణమైంది. జపాన్‌లో మోడీకి ఘన స్వాగతం పలకడానికి సన్నాహాలు పూర్తయ్యాయి.