బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్ అమిత్ షా

 

భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్‌గా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికయ్యారు. పార్లమెంటరీ బోర్డు నుంచి పార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోసీలను తొలగించారు. మార్గదర్శక మండలి అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ విభాగంలో పార్టీ మార్గదర్శకులుగా వారిద్దరినీ నియమించారు. భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా నరేంద్రమోడీ, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, అనంత్ కుమార్, తావర్ చంద్ గెహ్లాట్, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవహరిస్తారు.