ముగిసిన కేసీఆర్, మోడీ భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీల భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో వీరిద్దరూ రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా కేసీఆర్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చాలని ప్రధాని మోడీని కోరినట్టు తెలస్తోంది. అంతేకాదు మిషన్ కాకతీయ, థర్మల్ పవర్ స్టేషన్ల ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానించారు. కాగా మొత్తం మూడు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.