నరేంద్రమోడీ ర్యాలీలో ప్రమాదం

 

 

 

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు యువతులు కూడా వున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్రమోడీ ఉత్తర్ ప్రదేశ్‌లోని సలీంపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. మోడీ ర్యాలీకి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ర్యాలీని ఉద్దేశించి అనౌన్స్ మెంట్లు చేసేందుకు నిర్మించిన ఒక వేదిక మీదకి జనం భారీగా ఎక్కడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు గాయపడ్డారు. గాయపడిన వారికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలిసింది.