ఎమ్మెల్యే కారుకు యాక్సిడెంట్

 

శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట తెలుగుదేశం శాసనసభ్యుడు రమణమూర్తి కారును శ్రీకాకుళంలో ఒక ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు బోల్తా పడింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే లేరు. ఎమ్మెల్యే మరో కారులో వున్నారు. బోల్తా పడిన కారులో ఎమ్మెల్యే అంగరక్షకుడు, వ్యక్తిగత సహాయకుడు వున్నారు. దాంతో వారిరువురూ ఈ ప్రమాదంలో స్వల్వంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైందని తెలుసుకున్న నర్సన్నపేట నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డారన్న విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.