పవన్ కు ఎందుకంత కడుపుమంట.. ఏపీ మంత్రి
posted on Jun 27, 2020 3:30PM
కాపు నేస్తం పేరుతొ వైసిపి ప్రభుత్వం అంకెల గారడీ చేసి కాపులను మోసం చేస్తోందని జనసేన అధినేత పవన కళ్యాణ్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రి కన్నబాబు తాజాగా పవన్ వ్యాఖ్యల పై ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో కాపులకు తొలి ఏడాది వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు కేవలం వంద కోట్లు ఇచ్చినపుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి ప్రశ్నించారు. పవన్కు చంద్రబాబు గొప్ప సంస్కర్తగా కన్పిస్తారని కన్నబాబు ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్కు సీఎం జగన్ అంటే నచ్చదని అందుకే ఆయనపై నిరంతరం విమర్శలు చేస్తుంటారని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పట్ల ఉన్న ప్రేమను పవన్ కళ్యాణ్ దాచుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కాపు నేస్తం అద్భుతమైన పథకమని ఈ సందర్బంగా మంత్రి అన్నారు. ఈ పథకం కింద మహిళలకు ఏటా రూ.15వేలు అందిస్తున్నామని దీని కోసం ఏడాదిలో రూ.4,769 కోట్లు ఖర్చు చేస్తున్నామని అయన తెలిపారు. పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కాపు నేస్తం పథకం పై దుష్ప్రచారం చేయడం దారుణమని ఆయన అన్నారు.