మంత్రి కొల్లు రవీంద్ర కారు బోల్తా..

 

ఆంధ్రప్రదేశ్‌ అబ్కారీశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమాదానికి గురయ్యారు. ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకొని.. కారులో విజయవాడ వస్తుండగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దాటి ఖాజా టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే ప్రమాదవశాత్తూ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మంత్రి రవీంద్రకు,  డ్రైవర్‌, మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. వీరిని తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.