జైల్లో కాల్పులు.. 52 మంది మృతి..

ఉత్తరమెక్సికోలోని మాంటరే నగరంలో టోపోచికో జైలులో ఘోర సంఘటన చోటుచేసుకుంది. టోపోచికో జైలులో ఉన్న రెండు ప్రత్యర్ధి వర్గాల మధ్య ఘర్షణ జరగి.. పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 52 మంది మరణించగా 12 మంది గాయపడ్డారు. ఈ సందర్బంగా రాష్ట్ర గవర్నర్ జేమీ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ కరుడుగట్టిన జెటాస్ డ్రగ్ ముఠాకు ఈ ఘర్షణలతో సంబంధముందని అంటున్నారు. అంతేకాదు ఈ గందరగోళంలో  పలువురు ఖైదీలు పారిపోయినట్టు తెలుపుతున్నారు.