చైర్మన్ చైర్... నేరేడుచర్లలో వివాదాల కారణంగా వాయిదా పడ్డ చైర్మన్ ఎన్నిక

నేరెడుచర్లలో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. నేరేడుచర్లలో కేవీపీ ఓటు వేయనున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేసేందుకు రాజ్యసభ సభ్యుడు కెవిపికి అనుమతులిచ్చింది.  మొదట కెవిపిని అనుమతించనందుకు మైకును విరగొట్టి.. పేపర్లు చింపి.. ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే సైదిరెడ్డి. ఈ దృశ్యాలన్ని వెబ్ కాస్టింగ్ లో రికార్డయ్యాయి. మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్ 7, టీఆర్ఎస్ 7, సీపీఎం 1 స్థానాల్లో గెలిచాయి. దీంతో సిపిఎం సభ్యుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులను రంగంలోకి దించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేవీపీ ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో మొదటి నుంచి చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేసేందుకు రాజ్యసభ సభ్యుడు కెవిపికి ఈసీ అనుమతినిచ్చింది. ఈ  వివాదం కారణంగా  చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఎంతో ఉత్కంఠ రేపిన  నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మొత్తానికి రేపటికి వాయిదా పడింది.రేపు అయినా ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతాయా లేదా అనేది వేచి చూడాలి.