పాతికేళ్ళ తర్వాతే పెళ్ళిగోల
posted on Oct 14, 2014 12:24PM
దేశంలోని యువతరానికి ఎంతమాత్రం నచ్చని ఓ సలహాని బీహార్ ముఖ్యమంత్రి రామ్ మాంఝీ ఇచ్చారు. అదేంటంటే, దేశంలోని యువతీ యువకులు పాతికేళ్ళు దాటేవరకూ పెళ్ళి గురించే ఆలోచించకూడదు. పాతికేళ్ళ తర్వాత పెళ్ళి చేసుకున్న కారణంగానే తాను ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. యూత్ పాతికేళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే అనారోగ్యానికి దూరంగా ఉండటమే కాక పోషకాహార లోపం సమస్యలు కూడా ఎదురుకావని ఆయన చెబుతున్నారు. అంచేత యువకులదే కాక యువతుల వివాహ వయసును 25 ఏళ్లకు పెంచితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గురుకుల వ్యవస్థను మాఝీ సందర్భంగా ప్రస్తావించారు. మనిషి జీవితాన్ని నాలుగు దశలుగా విభజించిన నాటి గురుకుల వ్యవస్థ 24 ఏళ్ల బ్రహ్మచర్యాన్ని, 24-48 ఏళ్ల దాకా గృహస్తాశ్రమాన్ని ప్రతిపాదించిందని ఆయన చెప్పారు.